తెలంగాణ ఉద్యమంలో కాకా కీలక పాత్ర పోషించారు

తెలంగాణ ఉద్యమంలో కాకా కీలక పాత్ర పోషించారు

కరీంనగర్ జిల్లా: జమ్మికుంటలో కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా నివాళులర్పించారు బీజేపీ నేత ఈటల రాజేందర్, ఆయన సతీమణి జమున. వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ. ఇతర నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాకా కీలక పాత్ర పోషించారని చెప్పారు ఈటల. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలందించారని గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. కాకా జయంతి సందర్భంగా ఉస్మానియా విద్యార్థి నేత సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమం ప్రారంభించారు ఈటల.