టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతోంది: మర్రి శశిధర్ రెడ్డి

టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతోంది: మర్రి శశిధర్ రెడ్డి

సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారని బీజేపీ నేత మర్రిశశిధర్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. అనేక రంగాల్లో ప్రజలు గోస పడుతున్నారని చెప్పారు. అవసరం లేకపోయినా రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి..ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. లక్షల కోట్లు దోచుకోవడానికే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. 

ప్రజాధనాన్ని దోచుకోవడానికే ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడ్డారని మర్రిశశిధర్ రెడ్డి చెప్పారు.ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని ఎప్పుడైనా కేంద్రాన్ని అడిగారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాబోది బీజేపీ ప్రభుత్వమే అన్నారు.