బీఆర్ఎస్ పాలన  రజాకార్లను తలపిస్తోంది: బీజేపీ నేత విజయశాంతి ఫైర్​

బీఆర్ఎస్ పాలన  రజాకార్లను తలపిస్తోంది: బీజేపీ నేత విజయశాంతి ఫైర్​

మేడిపల్లి/హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పాలన రజాకార్లను తలపిస్తోందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. గురువారం ఆమె పీర్జాదిగూడలోని తీన్మార్ మల్లన్న ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. తర్వాత ఆమె మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అరాచకాలు మల్లన్న బయట పెడుతున్నారని తెలిపారు. ఆయనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలు ప్రజలకు తెలిసేలా ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలపై కేసులు నమోదు చేయడం చాలా దారుణమని మండిపడ్డారు. మీడియాను ఇబ్బంది పెట్టిన నిజాం ప్రభుత్వం మట్టి కరిచిన రోజులను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. మల్లన్న కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. కాగా, రాష్ట్రంలో కేసీఆర్ పర్యటన ఏడాదికోసారి వచ్చే ఉగాది పండగ లెక్క ఉందని ట్విట్టర్‌‌‌‌‌‌లో ఆమె ఎద్దేవా చేశారు. ‘‘సీఎం కేసీఆర్ మిమ్మల్ని చూస్తారట. ఇప్పుడు వచ్చారు.. మళ్లా ఎప్పుడు కన్పడ్తరో దొరగారు? వచ్చే ఎన్నికల్లో ఆయనను స్వాగతిస్తరో లేక సెలవిస్తారో మీ విజ్ఞత” అని పోస్ట్ చేశారు.