800 షాపులకు కవితనే లిక్కర్ సరఫరా చేసింది : వివేక్ వెంకటస్వామి

 800 షాపులకు కవితనే లిక్కర్ సరఫరా చేసింది : వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ క్వీన్ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. లిక్కర్ పాలసీలో 25 శాతం  వ్యా్ట్ కు 1 శాతం తగ్గించారన్నారు. 32 రూపాయల కమిషన్ ను 340 రూపాయలకు పెంచారని చెప్పారు. 800 షాపులకు కవితనే లిక్కర్ సరఫరా చేసిందన్నారు. మంచిర్యాల జిల్లా  మందమర్రిలో యువకులు, తెలంగాణ జాగృతికి చెందిన మహిళలు వివేక్ సమక్షంలో బీజేపీలో చేరారు.

రాష్ట్రం  ఏర్పాడ్డాక కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదని కల్వకుంట్ల కమిషన్ రావుని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న వివేక్... మిషన్ భగీరథలో 40 వేల కోట్లు మెగా కృష్ణారెడ్డి తో కలిసి కేసీఆర్ దోచుకున్నాడని ఆరోపించారు. ప్రజల బతుకులను ఆగం చేసిన  బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని వివేక్ పిలుపునిచ్చారు.