హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు అభ్యర్థి దొరకడం లేదు

హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు అభ్యర్థి  దొరకడం లేదు

హుజూరాబాద్ ఎన్నికల కోసమే.. TRS.. కృష్ణా వివాదాన్ని తెరపైకి తెచ్చిందన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. సంగమేశ్వరం పనులు జరుగుతున్నా కేసీఆర్ ఫాంహౌస్ లో నిద్రపోయారని విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో సంపాదించిన అవినీతి సొమ్ముతో KCR బైపోల్ లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. లీడర్లను కొనేందుకు టీఆర్ఎస్ 70 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి. హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు అభ్యర్థి కూడా దొరకడం లేదన్నారు బీజేపీ నేతలు. బిజెపి నాయకులు అందరితో కలిసి ఈటల రాజేందర్ ను గెలిపిస్తామన్నారు. పోలీసులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారన్నారు. మంత్రులంతా హుజురాబాద్  లో తిష్ట వేసి 40 కోట్లు ఇస్తాం.. 50 కోట్లు ఇస్తాం అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.