బీజేపీ నేతల ఢిల్లీ బాట : అగ్రనేతలను కలుస్తున్న టికెట్ ఆశావహులు

బీజేపీ నేతల ఢిల్లీ బాట : అగ్రనేతలను కలుస్తున్న టికెట్ ఆశావహులు

హైదరాబాద్: బీజేపీలో అసెంబ్లీ టికెట్లకు బారీ డిమాండ్ ఏర్పడింది. టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేసుకునేందుకు పలువురు నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఇక్కడ రాష్ట్రంలో ఓ వైపు దరఖాస్తు ఫారాల స్క్రూట్నీ జరుగుతున్న తరుణంలో నేతలు హస్తినబాట పట్టడం గమనార్హం. మహిళా బిల్లు నేపథ్యంలో ఢిల్లీలోనే ఉన్న బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ని, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిని కలుస్తూ తమకు టికెట్ వచ్చేలా చూడాలని కోరుతున్నారు. 

ఢిల్లీ వెళ్లినవారిలో నర్సాపూర్ నుంచి టికెట్ ఆశిస్తున్న గోపి, జూబ్లీహిల్స్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకునన లంకల దీపక్ రెడ్డి, షాద్ నగర్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, పటాన్ చెరు కోసం దరఖాస్తు చేసుకున్న గడీల శ్రీకాంత్ గౌడ్, పరిగి టికెట్ ఆశిస్తున్న కిరణ్ గౌడ్, కంటోన్మెంట్ టికెట్ ఆశిస్తున్న సంధ్య థియేటర్ యజమాని శివ ఉన్నారు. అందోలో టికెట్ తన తండ్రికే కేటాయించాలని బాబు మోహన్ కుమారుడు ఉదయ్ బీజేపీ ముఖ్యనేతలను కలిసి వేడుకుంటున్నారని సమాచారం.