
మెదక్టౌన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మెదక్ టౌన్లో బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రాందాస్చౌరస్తాలో ఆటోకు తాళ్లను కట్టి లాగి నిరసన తెలిపారు. హాజరైన ఎస్టీ మోర్చ రాష్ట్ర సెక్రెటరీ అమర్సింగ్ పవార్, బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్ ప్రియానాయక్మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలోని 21 రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించిందన్నారు. అయినప్పటికీ తెలంగాణ సీఎం కేసీఆర్వ్యాట్ను తగ్గించక పోవడం వల్ల ప్రజలపై భారం పడుతోందన్నారు. ప్రజాసంక్షేమం ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా జనరల్సెక్రెటరీ విజయ్ కుమార్, ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రెడ్యానాయక్, బాల్కిషన్ నాయక్, శంకర్ నాయక్, యువ మోర్చా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ఉదయ్ కిరణ్, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, లీడర్లు శివ, వేణు, రవి, వరప్రసాద్ పాల్గొన్నారు.