క్యాంపు ఆఫీస్ ఎదుట బీజేపీ కార్యకర్తల ఆందోళన.. నిరసనకారుల్ని అరెస్ట్​ చేసిన పోలీసులు

క్యాంపు ఆఫీస్ ఎదుట బీజేపీ కార్యకర్తల ఆందోళన.. నిరసనకారుల్ని అరెస్ట్​ చేసిన పోలీసులు

సీఎం కేసీఆర్​ మెదక్​పర్యటన వేళ జిల్లా కేంద్రంలో బీజేపీ నిరసనలు చేపట్టింది. ఉదయాన్నే బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైటాయించి నిరసన తెలిపారు. 

అర్హులకు డబుల్​బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని, గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్​ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసన కారులను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. 

ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. డీఎస్పీ ఫనీంద్ర తమను దూషించారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారుల్ని అరెస్టు చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు.