అమ్మాయి పుడితే రూ. లక్ష డిపాజిట్!

అమ్మాయి పుడితే రూ. లక్ష డిపాజిట్!

తాను ఎమ్మెల్యేగా గెలిస్తే.. తన నియోజకవర్గంలో అమ్మాయి పుడితే బ్యాంకులో లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుష్బూ ప్రకటించారు. తమిళనాడు ఎన్నికల రాజకీయం వేడెక్కెంది. నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు గెలుపు కోసం పోటీ పడుతున్నారు. సీనియర్ నటి కుష్బూ కూడా ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆమె చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె శనివారం తన నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ముఖ్యమని ఆ సందర్భంగా కుష్బూ అన్నారు. తన నియోజకవర్గంలో ఆడపిల్లలు పుడితే.. వెంటనే వారి పేరు మీద లక్ష రూపాయలు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఆడపిల్లలకు సహాయం అందించాలని... తద్వారా బ్రూణ హత్యలను నివారించవచ్చని ఆమె అన్నారు. ప్రచారంలో భాగంగా ఆమె ఓ టిఫిన్ సెంటర్ దగ్గర దోశలు వేశారు.