కేసీఆర్.. డబ్బు సంచులతో బీజేపీని అడ్డుకోలేవు: ఈటల 

కేసీఆర్.. డబ్బు సంచులతో బీజేపీని అడ్డుకోలేవు: ఈటల 

కేసీఆర్ జిల్లాగా పేరొందిన మెదక్ లో భవిష్యత్తులో టీఆర్ఎస్ గల్లంతవడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. డబ్బు సంచులతో కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో బీజేపీ బలోపేతాన్ని ఆపలేరని పేర్కొన్నారు. కేసీఆర్.. కేసీఆర్ కొడుకు.. అల్లుడు స్వయంగా ముగ్గురు నాయకత్వం వహించిన గడ్డ మీద రఘునందన్ ను గెలిపించి చెంప ఛెల్లుమనిపించిన ఘనత మెదక్ ప్రజలదని వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో నిర్వహించిన బీజేపీ సభలో ఆయన మాట్లాడారు.

కేసీఆర్ అడ్రస్ గల్లంతు చేసేదాకా బీజేపీ పోరాటం ఆగదని ఈటల స్పష్టం చేశారు.  ‘‘ కేసీఆర్ దమ్ముంటే కొట్లాడు.. వక్రమార్గాల ద్వారా డబ్బు సంచుల ద్వారా ఇతర పార్టీలను నిలువరించాలని భావిస్తే  నీ జేజమ్మ వల్ల కూడా కాదు’’ అని కామెంట్ చేశారు.  ‘‘హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టారు. మునుగోడులో కూడా అదే జరగబోతోంది. అక్కడి ప్రజలు బీజేపీ వైపే ఉంటారు’’ అని పేర్కొన్నారు. ‘‘ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ కు పోయినా కలవడు.. ప్రగతి భవన్ లోనూ కలవడు.. అలాంటి వ్యక్తిని ఓడించాలనే కసితో తెలంగాణ ప్రజలు ఉన్నారు’’ అని ఈటల చెప్పారు.