కేసీఆర్ ప్రజల కళ్లలో మట్టికొట్టి రాచరిక పాలన చేస్తుండు : ఈటల

కేసీఆర్ ప్రజల కళ్లలో మట్టికొట్టి రాచరిక పాలన చేస్తుండు : ఈటల

సీఎం కేసీఆర్ ప్రజల కళ్లలో మట్టికొట్టి రాచరిక పాలన సాగిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈ పాలనను అంతం చేయడానికి యావత్ తెలంగాణ ప్రజలు కులం, మతంతో సంబంధం లేకుండా ఏకమవుతున్నారని పేర్కొన్నారు. శంషాబాద్  మున్సిపాలిటీ పరిధిలోని మదనపల్లి, ముచ్చింతల్, పిల్లోని గుడా,పెద్ద తుప్ర గ్రామాలలో ఏర్పాటుచేసిన భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మదనపల్లి మాజీ సర్పంచ్ తో పాటు  షాపూర్ తండా, ముచ్చింతల్, పిల్లోనిగుడ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ లో చేరారు.  

చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు మునుగోడులో తృటిలో  టీఆర్ఎస్ గెలిచిందని ఈటల కామెంట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మునుగోడులో  బీజేపీ కార్యకర్తల కృషిని కొనియాడారని గుర్తు చేశారు. రాబోయే కాలంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా బీజేపీయే గెలుస్తుందన్నారు. పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.