
బీజేపీలో ఉంటే బీసీ బంధు ఇవ్వబోమంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. బీసీ బంధు పథకం చాట్ల తవుడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్లు ఉందన్నారు. ఏజెంట్లను పెట్టుకుని బీఆర్ఎస్ కు వత్తాసు పలికే వాళ్లకే బీసీ బంధు ఇస్తున్నారని తెలిపారు. బీసీ పథకం కోసం సిద్దిపేట జిల్లాలో 26 వేల అప్లికేషన్లు వచ్చాయన్నారు.
ALSO READ :వచ్చే ఎన్నికల్లో నేను మూడోసారి గెలవడం ఖాయం: ముత్తిరెడ్డి
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట బీసీ బంధు లబ్ధిదారుల జాబితా కూడా ఇవ్వడం లేదన్నారు రఘునందన్ రావు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో పట్టుమని పది మంది కూడా లేరన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లేదన్నారు. కొన్నిచోట్ల ఒక్కో ఇంట్లో ఇద్దరికీ బీసీ పథకం అందిస్తున్నాని ఆరోపించారు. ఉన్న వాళ్లకే మళ్లీ బీసీ బంధు అమలు చేస్తున్నారని ఆరోపించారు. బడుగుబలహీన వర్గాలకు చెందిన 93 కులాలకు బీసి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.