
హైదరాబాద్: టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ బీఏసీ సమావేశానికి తమను ఆహ్వానించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. స్పీకర్ అంటే తమకు గౌరవం ఉన్నా, ఆయన తీరే సరిగా లేదని చెప్పారు. బీఏసీ మీటింగ్కు తమను పిలవకపోవడంపై సోమవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని రఘునందన్ రావు తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోతే.. టీడీపీకి పట్టిన గతే రానున్న రోజుల్లో టీఆర్ఎస్కూ పడుతుందని హెచ్చరించారు.