ఎస్పీ రైతులకు దమ్కీ ఇచ్చి పోతుండు : రఘునందన్

ఎస్పీ రైతులకు దమ్కీ ఇచ్చి పోతుండు : రఘునందన్

కామారెడ్డి ఎస్పీ రైతులకు సున్నితంగా దమ్కీ ఇచ్చిపోతున్నాడని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ వచ్చేదాక కదిలేది లేదని స్పష్టం చేశారు. రైతులు శాంతియుతంగా గాంధేయమార్గంలో ధర్నా చేస్తున్నారని చెప్పారు. 

మరోవైపు రైతులతో కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి చర్చలు జరిపారు. ఐదుగురు లేదా పది మంది వచ్చి కలెక్టర్ను కలవాలని సూచించారు. తాను అనుకుంటే నిమిషంలో అంతా తీసెయ్యగలనని.. కానీ అలా చేయనన్నారు. దమ్మీ ఇచ్చేవాడినే అయితే రఘునందన్ రావు హైదరాబాద్ లోనే ఉండేవాడని తెలిపారు. టార్గెట్ చేసి మాట్లాడడం సరికాదని అన్నారు. మాస్టార్ ప్లాన్ కు సంబంధించి ముసాయిదా మాత్రమే సిద్ధమైందని..ఇంకా అప్రూవ్ కాలేదని స్పష్టం చేశారు. 

కాగా కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా కొనసాగుతోంది. కలెక్టర్ స్పందించేవరకు ధర్నా కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. రాత్రి కూడా ధర్నా కంటిన్యూ చేస్తామని స్పష్టం చేశారు. సమస్య పరిష్కరించేవరకు అక్కడి నుంచి కదిలేది లేదని తెలిపారు. కలెక్టర్ బయటకు రావడానికి ఎందుకు భయపడుతున్నారని అడిగారు.