రూ.500 నోటుపై శ్రీరాముని ఫొటో ముద్రించాలి : రాజాసింగ్​

రూ.500 నోటుపై శ్రీరాముని ఫొటో ముద్రించాలి : రాజాసింగ్​

హైదరాబాద్, వెలుగు: రూ.500 నోటుపై శ్రీరాముని ఫొటో ముద్రించాలని ఎమ్మెల్యే రాజాసింగ్​అన్నారు. మహారాష్ట్ర శంబాజీపూర్​లో జరిగిన ఓ కార్యక్రమం లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే అమెరికా, థాయ్​లాండ్, యూరప్, ఇండోనేసియా దేశాలలో కరెన్సీపై మన దేవుండ్ల ఫొటోలను ముద్రించి చెలామణి లో ఉంచారని తెలిపారు. రూ.500 నోటు పై రాముడి ఫొటో ముద్రించాలనేది 100 కోట్ల మంది హిందువుల డిమాండ్ అని ఆయన చెప్పారు. 

అయోధ్యలో జనవరి 22న రాముని ప్రాణప్రతిష్ఠ జరుగనుందని పేర్కొన్నారు. దేశంలో వక్ఫ్ బోర్డు పేరుతో ఉన్న భూములు రిలీజ్ చేయాలని డిమాండ్​ చేశారు. దేశ విభజ న సమయంలో మన దేశ ప్రజలను హత్య చేసిన వారి ఆస్తులు కాపాడేందుకు నెహ్రూ వక్ఫ్ చట్టం తెచ్చారని ఆరోపించారు.