ఒక్క ఫోన్ కాల్ తో ఏమైందో తెలుసుగా..కేసీఆర్ ఇక నీ ఆటలు సాగవ్

ఒక్క ఫోన్ కాల్ తో ఏమైందో తెలుసుగా..కేసీఆర్ ఇక నీ ఆటలు సాగవ్

దుబ్బాక లో పబ్లిక్ దుమ్ము లేపుతున్నారని అన్నారు ఎంపీ అరవింద్ .బీజేపీ పువ్వు గుర్తు కు ఓటేసెందుకు సిద్దం అయ్యారని ధీమా వ్యక్తం చేశారు. అందుకే దుబ్బాకకు సీఎం కేసీఆర్ రాలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. ఇవ్వన్నీ తెల్సి కేసీఆర్  వరంగల్ ల్లో మాట్లాడిండు.

సన్నాల వేయమని చెప్పింది ఈ కేసీఆర్  సన్నాసే..నేనే ఇంజనీర్ ను ప్రాజెక్ట్ లు కడతా, నేను డాక్టర్ ను కరోనా రాదన్నడు. నేనే సైంటిస్ట్ ను సన్నాల ను వేయమన్నడు.. మనను మాత్రం సన్నాలు, సోయా వేసుకోమంటడు. ఆయన మాత్రం ఫాం హౌస్ లో బాగా డబ్బులు వచ్చే పంట వేసుకుంటడు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? అని ప్రశ్నించారు.

పొద్దున లేస్తే కేసీఆర్  అబద్ధాలు చెబుతున్నారన్న ఆయన…బీజేపీకి ఓటేస్తే  రూ.2వేల పెన్షన్ ఇవ్వమని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మీ బెదిరింపులకు ప్రజలు భయపడరు. బీజేపీ  కే ఓటు వేస్తారు. నూటికి నూరుశాతం పంట కొనుగోలు చేసి వరి రైతులకు డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం కాదని గుర్తు చేశారు. అమిత్ షా కు ఒక్క ఫోన్ కాల్ కాల్ చేస్తే ప్రజా స్వామ్యన్ని కాపాడేందుకు స్పెషల్ ఆఫీసర్ ను పంపారు. కేసీఆర్ నీ ఆటలు ఇక సాగవ్ అంటూ ఎంపీ అరవింద్ సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు.