ప్రధాని మోదీని తిడితే నాలుక కుట్టేస్తం: డీకే అరుణ

ప్రధాని మోదీని తిడితే నాలుక కుట్టేస్తం: డీకే అరుణ

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక మడత పెట్టి కుట్టేస్తామని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు పిచ్చి కుక్కల్లా మొరుగుతున్నారన్నారు. గత 9 ఏండ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని, ఆ నిధులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో అరుణ మీడియాతో మాట్లాడారు.

 “కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ రావు.. వీళ్లంతా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిందే కల్వకుంట్ల కంత్రీ కుటుంబం కోసం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు” అని మండిపడ్డారు. ప్రధాని మోదీ నిజాలను ప్రజలకు చెప్పారని, అది భరించలేక బీఆర్ఎస్ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ చెబుతున్న తెలంగాణ మోడల్ అంటే అవినీతి మోడల్ అని, అంతకుమించి ఏమీ లేదని అన్నారు. పాలమూరు–రంగారెడ్డి డిజైన్లు మార్చి, అడ్డగోలుగా అంచనాలు పెంచారని ఆరోపించారు.