బీసీలు ఏకం కావాలి : డీకే అరుణ

బీసీలు ఏకం కావాలి : డీకే అరుణ

గద్వాల, వెలుగు: రాష్ట్రంలో బీసీలు ఏకం కావాలని, బీఆర్ఎస్, కాంగ్రెస్  పార్టీ అభ్యర్థులను ఓడించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు. బీజేపీ అభ్యర్థి బలిగేరా శివారెడ్డి నామినేషన్  సందర్భంగా పట్టణంలో బైక్  ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. 

రాష్ట్రంలో బీఆర్ఎస్  పాలనలో జరుగుతున్న దోపిడీ నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి పొందాలంటే డబుల్  ఇంజిన్  సర్కార్  రావాల్సిన అవసరం ఉందన్నారు. బోయ వాల్మీకి సోదరులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని బీఆర్ఎస్  ప్రభుత్వం మోసం చేసిందని, ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. డీకే స్నిగ్ధా రెడ్డి, రామాంజనేయులు, కృష్ణవేణి, వీరుబాబు, కుమ్మరి శీను, పూజారి శ్రీధర్, రజక జయశ్రీ పాల్గొన్నారు.