టీఆర్ఎస్ సర్కారు చెప్పేదొకటి... చేసేదొకటి

టీఆర్ఎస్ సర్కారు చెప్పేదొకటి... చేసేదొకటి

మంచిర్యాల: టీఆర్ఎస్ సర్కారు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. తాగునీటి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్న మాటలు వట్టివేనని కొట్టిపారేశారు. జిల్లాలోని కన్నెపల్లి మండలం జన్కాపూర్ లో ఎంపీపీ సృజన నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్లారం పోశమ్మ మొక్కుల కార్యక్రమంలో వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు తమ కష్టాలను ఆయనకు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని, సమస్యలన్నీ అలాగే ఉన్నాయని చెప్పారు. కనీసం తాగునీటి అవసరాలను కూడా తీర్చకపోతే ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. ఎండలు మండిపోతూ జనం తాగునీటి కోసం అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని దుయ్యబట్టారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు విశాక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వందలాది బోర్లు వేయించానని గుర్తు చేశారు. తాను ఏ స్థాయిలో ఉన్నా ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తానని వివేక్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం...

అట్టహాసంగా ప్రారంభమైన ‘ఖేలో ఇండియా’ గేమ్స్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉత్తమ్ ఆగ్రహం