రాష్ట్రానికి కేసీఆర్ కాలయముడు

రాష్ట్రానికి కేసీఆర్  కాలయముడు


రాష్ట్రానికి కేసీఆర్ కాలయముడన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.రైతులు అప్పుల పాలైతుంటే కేసీఆర్ కోట్లకుపడగలెత్తుతుండన్నారు.రాష్ట్రంలోని అన్ని మండలాలు గ్రామాలలో కోవిడ్ , లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ దీక్షలు చేస్తున్నారు. తెలంగాణ  రైతు గోస - బీజేపీ  పోరు దీక్ష పేరుతో నిరసన చేస్తున్నారు బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ తో పాటు ముఖ్య నేతలు నిరసన తెలుపుతున్నారు.  ఈ సందర్బంగా మాట్లాడిన బండి సంజయ్ ..బీజేపీ పోరాటాలతోనే సీఎం ఫాంహౌస్ నుంచి బయటకొచ్చిండన్నారు. బీజేపీ ఓత్తిడితోనే కేసీఆర్ రెండు హాస్పిటల్స్ సందర్శించారన్నారు. తెలంగాణలో రైతు ఏడుస్తున్నాడన్నారు. కేసీఆర్ వి ఊకదంపుడు ఉపన్యాసాలన్నారు. ఉచితంగా యూరియా, విత్తనాలు ఎందుకు ఇస్తలేరన్నారు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు.కొనుగోలు పూర్తైనా అకౌంట్లో డబ్బులు పడడం లేదన్నారు.టీఆర్ఎస్ నేతలు కమీషన్ ఏజెంట్లుగా మారారన్నారు. కనీసం 75లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనలేదన్నారు.