బెంగళూరు: కర్ణాటకలో పర్యటిస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన బెంగళూరుకు చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై ఘన స్వాగతం పలికారు. బళ్లారి సమీపంలోని తోరణగల్లు తదితర ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న కీలకమైన రాష్ట్రం కావడంతో జేపీ నడ్డా పర్యటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రేపు విరూపాక్షేశ్వర ఆలయంతోపాటు ప్రాచీన ఆలయాలను జేపీ నడ్డా సందర్శించనున్నారు.
ఇవి కూడా చదవండి
సారవంతమైన సాగుభూములను లాక్కుంటే అడ్డుకుంటాం
ప్రజలేం తినాలో ప్రభుత్వం నిర్ణయించదు