నిరుద్యోగులకు న్యాయం చేయాలి.. కూకట్ పల్లిలో బీజేపీ ర్యాలీ

నిరుద్యోగులకు న్యాయం చేయాలి.. కూకట్ పల్లిలో బీజేపీ ర్యాలీ

ఓ వైపు నోటిఫికేషన్లు విడుదల  చేస్తూ.. మరోవైపు కోర్టులలో కేసులు వేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీజేపీ నేత యోగానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేపీహెచ్బీ నుంచి వివేకానంద నగర్ వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్ష పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఫలితాలు విడుదల చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగాల ప్రకటనపై ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి తెలుస్తోందని యోగానంద్ మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి నోటిఫికేషన్లు విడుదల చేసి.. నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయడం లేదని ఫైర్ అయ్యారు.