కేంద్రం నిధులపై కేటీఆర్​ అబద్ధాలు

కేంద్రం నిధులపై కేటీఆర్​ అబద్ధాలు
  • వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలె :  రాణి రుద్రమ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని అబద్ధాలు చెప్తున్న మంత్రి కేటీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర​అధికార ప్రతినిధి రాణి రుద్రమ డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో పెద్ద మొత్తంలో ఫండ్స్​ ఇస్తున్న కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలన్నారు.

బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని ఆమె కేటీఆర్​కు సవాల్ విసిరారు. తెలంగాణలో సంక్షేమ పథకాల కోసం తొమ్మిదేండ్లలో కేంద్రం రూ.5 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని వివరించారు. రాష్ట్రంలో నేషనల్ హైవేల కోసం రూ.5 వేల కోట్లు, పట్టణ, గ్రామీణ రోడ్ల కోసం రూ.లక్షా 9 వేల కోట్లు ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో ఖర్చు పెట్టిన దానికంటే కేంద్రం ఇచ్చిన నిధులే ఎక్కువన్నారు. రాష్ట్రం కేంద్రానికి రూ.లక్షా 68 వేల కోట్ల పన్నులు కట్టిందని కేటీఆర్ పదే పదే చెపుతున్నారని, అంతకన్నా మూడు రెట్లు కేంద్రం ఎక్కువ ఇచ్చిందని ఆమె 
పేర్కొన్నారు.