భాగ్యనగర్ అంటే యువరాజ్ కేటీఆర్ నారాజయ్యారు

భాగ్యనగర్ అంటే యువరాజ్ కేటీఆర్ నారాజయ్యారు

హైదరాబాద్‌ను భాగ్యనగర్ అంటే యువరాజ్ కేటీఆర్ నారాజయ్యారని జీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఓఎన్‌జీసీ స్వతంత్ర డైరెక్టర్ సంబిత్ పాత్ర అన్నారు. తాను మాత్రం భాగ్యనగర్ అని గర్వంగా చెబుతానని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ మరియు కేసీఆర్ దోస్త్ సర్కార్ నడుస్తోందని ఆయన ఎద్దేవాచేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ‘మేం జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోరాడుతున్నాం. టీఆర్ఎస్ వాళ్లు మాత్రం FFMC ప్రైవేట్ లిమిటెడ్ మున్సిపల్ (ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్) ఎన్నికల్లో పోరాడుతున్నారు. కాంగ్రెస్‌కి ఓటేస్తే.. టీఆర్ఎస్‌కి వేసినట్లే. టీఆర్ఎస్‌కి ఓటేస్తే.. ఎంఐఎంకి వేసినట్లే. అభివృద్ధి చేసే బీజేపీ మేయర్ కావాలో లేక మతతత్వ ఎంఐఎం మేయర్ కావాలో ప్రజలు ఆలోచించాలి. ఎంఐఎంతో పొత్తులేకపోతే తెలంగాణలో 17 ఎంపీ సీట్లుంటే.. కారు సారూ 16 అని ఎందుకు అన్నాడు. కార్ పంచర్ అయింది సార్. ఫార్మ్ హౌస్‌లో కూర్చొని ఎగ్జిట్ పోల్ చేస్తే 16 ఎంపీ సీట్ల సంఖ్య 9కి తగ్గింది. బీహార్‌లో కూడా వర్క్ ఫ్రం హోం ఎగ్జిట్ పోల్ చేశారు. అందుకే ఫెయిల్ అయింది. భారత్ మాతాకు జై, హిందూస్తాన్, భారత్ అనే పదాలు అనను అనే ఎంఐఎంని ఓడించాలి. ఓ
వైసీ ఒక నయా జిన్నా. భాగ్యనగర్ గడ్డ మీది నుంచి అడుగుతున్న మోడీని ప్రధానిగా గుర్తిస్తావా లేదా? ఓవైసీ స్పష్టం చేయాలి. కేటీఆర్ మా పర్మిషన్ లేకుండా ఓల్డ్ సిటీకి ఎలా వచ్చాడని ఎంఐఎం అడుగుతుంది. ఓల్డ్ సిటీకి రావాలంటే వీసా తీసుకొని రావాలా? ఇక్కడ ఓవైసీ సీఎం అని ఎంఐఎం నేతలు అంటున్నారు. పాత బస్తీ మాదే, న్యూ బస్తీ మాదే. హైదరాబాద్‌లో అకాల వర్షాల వల్ల 80 మంది మరణించారు. దీనికి ఎవరిది బాధ్యత. వరద బాధితులకు 10 వేల రూపాయల సాయం ఇవ్వకుండా జేబులో వేసుకున్నారు. వరదసాయంలో పెద్ద కుంభకోణం జరిగింది’ అని ఆయన అన్నారు.

For More News..

బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం

స్కానింగ్‌కు వచ్చిన గర్భవతిని తాగిన డాక్టర్..

ప్రకాష్ రాజ్ వర్సెస్ నాగబాబు.. పవన్ కళ్యాణ్‌ ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నారు