ధరణి పేరుతో ఆ నలుగురు కలెక్టర్లు పేదల భూములను గుంజుకుంటున్నారు: బండి సంజయ్

ధరణి పేరుతో ఆ నలుగురు కలెక్టర్లు పేదల భూములను గుంజుకుంటున్నారు: బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు : ధరణి పేరుతో ఆ నలుగురు కలెక్టర్లు పేదల భూము లను గుంజుకుంటున్నారని, వారు కేసీఆర్ కుటుంబానికి దోచిపెడుతున్నారని మంగళవారం సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. వారిపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆ నలుగురు కలెక్టర్లపై పక్కా ఆధారాలు తీసుకున్న సంజయ్ గురువారం లేదా శుక్రవారం ఢిల్లీలోని డిపార్ట్ మెంట్ఆఫ్ పర్సనల్  ట్రెయినింగ్  అధికారులకు  ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. బుధవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆయన.. డీవోపీటీ అధికారుల అపాయింట్ మెంట్  కోరినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో సంజయ్ కి డీవోపీటీ నుంచి పిలుపు రాగానే వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు.