వరంగల్ సీపీ లెక్క తేలుస్తాం...బండి సంజయ్ వార్నింగ్

వరంగల్ సీపీ లెక్క తేలుస్తాం...బండి సంజయ్ వార్నింగ్

సీఎం కేసీఆర్ కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో రేవంత్ రెడ్డిని తన బిడ్డ పెళ్లిని చూడకుండా చేసిండని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ విలువలు తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగం తప్పా ఇంకేమి లేదన్నారు. - విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై లాఠీ చార్జ్ చేసిన మూర్ఖుడు, తెలంగాణ ప్రజలని దోసుకుంటున్న మూర్కుడు.. ప్రజలను  అరిగోస పెడుతున్న మూర్కుడు కేసీఆర్ అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకు బెయిల్ రావద్దు అని ఎలా అంటాడని బండి సంజయ్ ప్రశ్నించారు. తన ఫోన్ను ఎవరు ఎత్తుకు వెళ్తారు..పోలీసులే తన ఫోన్ను దొంగిలించారని ఆరోపించారు. ప్రశాంత్ వాట్సాప్ చేస్తే తాను సాయంత్రం 5 గంటలకు చూసుకున్న అంటున్నారు. కానీ ఎగ్జామ్ 11:30 కి అయిపోయింది కదా? అన్నారు. వరంగల్ సీపీ రంగనాథ్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని..ఆయన విజయవాడ, ఖమ్మం, వరంగల్లో ఏమేమి దందాలు చేసాడో తెలుసన్నారు.  అన్ని బయటకి తీసుకోస్తామన్నారు. అమాయకుల మీద ఆరోపణలు తప్పా ఇంకేమి చేయలేదని విమర్శించారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలకు  ఆధారాలు చూపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

విశాఖ ఉక్కు ప్లాంట్ పై కేసీఆర్కి ఏం అవసరమని బండి సంజయ్ ప్రశ్నించారు. నిజాం- షుగర్ ఫ్యాక్టరీ తెరవమంటే తెరవడు... కానీ పక్కనోళ్ళవి కావాలా అని చురకలంటించారు. బయ్యారం ఫ్యాక్టరీ తెరిచి 20 వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని కేసీఆర్ 2018లో హామీ ఇచ్చాడని..ఇంత వరకు నెరవేర్చలేదన్నాడు. అటు సింగరేణిలో 20 వేల కోట్లను డైవర్ట్ చేశాడని..62 వేల ఉద్యోగుల సంఖ్యల  ఇవాళ సగానికి తగ్గించారని మండిపడ్డారు.