దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. పురులియాలో జరిగిన టీఎంసీ వర్కర్ల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. నోట్ల రద్దు లాంటి చర్యలతో దేశాన్ని ధ్వంసం చేశారని,నోట్ల రద్దు ఒక పెద్ద స్కామ్ అని ఆమె అన్నారు. ఇక దర్యాప్తు ఏజెన్సీలతో విపక్షాలను టార్గెట్ చేస్తున్నారని మమతా విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మొత్తం కల్తీగా మారిపోయిందని ఆరోపించారు. కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఎంట్రీ ఉండదన్న మమతా..ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేవని అన్నారు.
Remember BJP Government, despite how much you try in 2024, it (victory) will not happen. No entry means you can't enter. From now on, people are saying '2024 no entry for BJP': West Bengal CM Mamata Banerjee in Purulia
— ANI (@ANI) May 31, 2022
(File photo) pic.twitter.com/7dkGFiqz03
మరిన్ని వార్తల కోసం
శబరి ఎక్స్ప్రెస్ కు బాంబు బెదిరింపు..ఫేక్ కాల్ గా గుర్తింపు
సీఎం కేసీఆర్ ప్రజాసమస్యలను గాలికొదిలేశారు