బీజేపీ ఇంకా తన బెస్ట్ ఇవ్వలేదు

బీజేపీ ఇంకా తన బెస్ట్ ఇవ్వలేదు

బీజేపీ తన బెస్ట్ ఇంకా ఇవ్వలేదన్నారు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నడ్డా మాట్లాడారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. బెంగాల్ ప్రజలు ప్రధాని మోడీపై నమ్మకముంచారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలయ్యాక బెంగాల్ లో అనేకమంది కార్యకర్తలు హత్యకు గురయ్యారని, ఆ రాష్ట్రంలో బీజేపీ కొత్త కథ  రాయబోతుందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కరోనాను మోడీ సమర్థవంతంగా హ్యాండిల్ చేశారని చెప్పారు. వ్యాక్సినేషన్ పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి... 9 నెలల్లోనే 100 కోట్లకు పైగా డోసులు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు ధర్మేంద్ర ప్రధాన్.

మరిన్ని వార్తల కోసం..

ఛార్జీల పెంపు తప్పదు: ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్

ఒంటరిగా ఉండే టైం దొరకడమే అదృష్టమట!