రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో.. బీజేపీ కార్యకర్త NIA అదుపులోకి

రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో.. బీజేపీ కార్యకర్త NIA అదుపులోకి

బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు దేశవ్యాప్తంగా కలవరం సృష్టించింది. మార్చిలో రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో NIA విచారణ వేగవంతంగా చేస్తుంది. శుక్రవారం  షిమోగా జిల్లా తీర్థహళ్లి నుంచి సాయిప్రసాద్ అనే బీజేపీ కార్యకర్తను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తీర్థహళ్లిలోని ఇద్దరు ముస్లిం యువకుల ఇళ్లు, మొబైల్ షాపులపై అధికారులు దాడులు చేశారు. వీరిద్దరితో సాయిప్రసాద్‌కు సంబంధాలున్నట్లు విచారణలో తేలిందని తెలుస్తోంది. దీంతో అధికారులు సాయిప్రసాద్‌ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.

మార్చి 1న బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని ITPL రోడ్డులోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలిన విషయం తెలిసిందే. మార్చి 13న ఆ కేసున తీసుకున్న ఎన్ఐఏ గత నెలలో ముజమ్మిల్ షరీఫ్‌ను అరెస్టు చేసింది. ఈ పేలుడుకు షరీఫ్‌ కీలక సూత్రధారి. కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించిన తర్వాత అతని అరెస్టు జరిగింది. ఈ పేలుడుకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు ముస్సావిర్ షజీబ్ హుస్సేన్, మరో కుట్రదారుడు అబ్దుల్ మతీన్ తాహాలను ఏజెన్సీ ప్రాథమికంగా గుర్తించింది. హుస్సేన్ మరియు తాహా ఇద్దరినీ ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది.