జనాల్లో బీఆర్ఎస్​ను కూకటివేళ్లతో..కూల్చేయాలన్న కోపం

జనాల్లో బీఆర్ఎస్​ను కూకటివేళ్లతో..కూల్చేయాలన్న కోపం
  •     తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తాం 
  •     బీజేపీ జాతీయ నేత బండి సంజయ్ 

చౌటుప్పల్, వెలుగు :  బీఆర్ఎస్​ను కూకటివేళ్లతో కూల్చివేయాలన్న కోపంతో ప్రజలున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ఖమ్మం వెళ్తున్న ఆయనకు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. సంజయ్​ మాట్లాడుతూ తెలంగాణలో సర్వే సంస్థలు ఊహించని ఫలితాలను లోక్​సభ ఎన్నికల్లో చూడబోతున్నామన్నారు.

బీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు కాంగ్రెస్​కు ఓటేశారన్నారు. గులాబీ పార్టీని కూకటివేళ్లతో కూల్చివేయాలన్న కోపం ఇప్పటికీ ప్రజల్లో కనిపిస్తోందన్నారు. అధికారం ఇస్తే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా​అతి తక్కువ కాలంలోనే ప్రజల కోపానికి గురైన పార్టీ కాంగ్రెస్​ అని అన్నారు.

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగొని శంకర్, మునుగోడు నియోజకవర్గ కన్వీనర్ దూడల బిక్షం, మున్సిపల్​అధ్యక్షుడు కంచర్ల గోవర్ధన్ రెడ్డి , ఆలె చిరంజీవి, పోలోజు శ్రీధర్ బాబు, కాయితి రమేశ్​ ఉన్నారు.