![బీజేపీవి సెంటిమెంట్ పాలిటిక్స్](https://static.v6velugu.com/uploads/2024/05/39_kT0A2rjtOG.jpg)
- అయినా ఇండియా కూటమివైపే ప్రజలు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాటారం, వెలుగు: బీజేపీ సున్నితమైనఅంశాలను రెచ్చగొట్టి సెంటిమెంట్పాలిటిక్స్ చేయాలని చూస్తున్నదని, అది గమనించే జనం ఇండియా కూటమివైపు నిలబడ్డారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మంత్రి శ్రీధర్బాబు స్వగ్రామం భూపాలపల్లి జిల్లా ధన్వాడ లో దత్తాత్రేయ స్వామి ఆలయ మూడో వార్షికోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్కు పది నుంచి 14 ఎంపీ సీట్లు అచ్చే అవకాశం ఉందన్నారు. దేశ సంపదను కాపాడేది కాంగ్రెస్మాత్రమేనని ప్రజలు నమ్మి ఓటేశారన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్వరకు రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర, మణిపూర్నుంచి మహారాష్ట్ర వరకు చేపట్టిన బస్సు యాత్ర సక్సెస్ అయ్యాయన్నారు. ప్రజలు కచ్చితమైన మార్పు కోరుకున్నారని అభిప్రాయపడ్డారు.
తనకు ఇన్నేండ్లుగా అండగా ఉంటున్న మంథని నియోజకవర్గ ప్రజలు సుభీక్షంగా ఉండాలని ధన్వాడలోని శ్రీధత్తాత్రేయ స్వామి వారిని వేడుకున్నట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, ప్రేమ్సాగర్రావు, మక్కాన్సింగ్ఠాకూర్ పాల్గొన్నారు.