హుజురాబాద్ ప్రజలు ఈటల పక్షాన ఉన్నారు

హుజురాబాద్ ప్రజలు ఈటల పక్షాన ఉన్నారు

హుజురాబాద్ లో జరగనున్న ఉప ఎన్నికలకు TRS కు అభ్యర్థే కరువయ్యాడన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. నియోజకవర్గ ప్రజలంతా బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ పక్షాన ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్  వర్గాలతో చేయించిన సర్వేలోనూ 71 శాతం మంది ఓటర్లు బీజేపీ అభ్యర్ధి ఈటల కు మద్దతిస్తున్నట్లు తేలిందన్నారు. సర్వేలతో బెంబేలెత్తిన కేసీఆర్.. వార్డు మెంబర్ మొదలు ప్రజా ప్రతినిధులందరికీ లక్షలాది రూపాయల ఆశ చూపి TRS లోకి లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా హుజరాబాద్ లో కాషాయ జెండా ఎగురడం ఖాయమని తేల్చి చెప్పారు బండి.