తెలంగాణ ప్రభుత్వం ప్రజలన్ని మోసం చేస్తోంది: బైతి శ్రీధర్

తెలంగాణ ప్రభుత్వం ప్రజలన్ని మోసం చేస్తోంది:  బైతి శ్రీధర్

తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ.. రంగారెడ్డి జిల్లాలో బీజేవైఎం నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రధానమంత్రి అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేశారు. 

శంషాబాద్ మండలం మదనపల్లి, కొత్త తండా గ్రామంలో బీజేవైఎం నాయకులు వాడవాడ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు బైతి శ్రీధర్, లక్ష్మయ్య పాల్గొన్నారు. బైతి శ్రీధర్ కు మదనపల్లి తండా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళలు రాఖీ కట్టారు. ఆ తర్వాత గ్రామ ప్రజలతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. 

Also read : వైఎస్సార్ ఘూట్ వద్ద నివాళులు అర్పించిన షర్మిల

రక్షాబంధన్ కానుక

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చకుండా.. ప్రజలను మోసం చేస్తోందని బైతి శ్రీధర్ ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ ప్రధానమంత్రి రక్షాబంధన్ కానుకగా.. వంట గ్యాస్ సిలెండర్ పై రూ. 200 తగ్గిస్తున్నామని తెలిపారు. దీంతో 33 కోట్ల పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఊరనిస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా 10 కోట్ల మంది ఉజ్వల లబ్ధిదారులకు రూ. 400 ల అదనపు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రజలకు ఉన్న సమస్యలన్ని తీరుస్తామని బైతి శ్రీధర్ హామీ ఇచ్చారు.