బ్యాలెట్ పేపర్లపై క్షుద్ర పూజలు... ఖమ్మం జిల్లా గోళ్లపాడు గ్రామంలోకలకలం

బ్యాలెట్ పేపర్లపై క్షుద్ర పూజలు... ఖమ్మం జిల్లా గోళ్లపాడు గ్రామంలోకలకలం

ఖమ్మం రూరల్, వెలుగు: రెండో విడత ఎన్నికల వేళ గోళ్లపాడులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఖమ్మం రూరల్​ మండలం గోళ్లపాడు గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున గ్రామపంచాయతీ ఆఫీస్​ ఎదుట పసుపు, కుంకుమతో క్షుద్ర పూజలు చేశారు. కాంగ్రెస్  అభ్యర్ధి తొండల రవికి కేటాయించిన కత్తెర గుర్తు ఉన్న నమూనా బ్యాలెట్​ పేపర్లను పెట్టి క్షుద్రపూజలు చేశారు. 

ఈ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో గ్రామస్తులు షాక్​కు గురయ్యారు. ఈ ఘటన వెనక ప్రత్యర్థులు ఉన్నారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరపాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కన్న తల్లి డెడ్ బాడీ ఇంట్లో ఉంచుకొని ఓటేసిన కొడుకు

దహెగాం, వెలుగు: కన్న తల్లి చనిపోయి పుట్టెడు దు:ఖంలోనూ కొడుకు తనవంతు బాధ్యతగా ఓటేశాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా దహెగాం మండల కేంద్రానికి చెందిన కాటారాపు కమల అనారోగ్యంతో ఆదివారం ఉదయం చనిపోయింది. 

కాగా, ఆమె కొడుకు కాటారపు శ్రీనివాస్​ తల్లి చనిపోయిన బాధను దిగమింగి మండల కేంద్రంలోని పోలింగ్​ స్టేషన్​కు వచ్చి ఓటేశాడు. విషయం తెలుసుకున్న పలువురు ఆయనను అభినందించారు.