మహిళలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతుంటారు. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం, పౌష్టికాహార లోపమే దీనికి కారణం.. రోజూ మనకు లభ్యమయ్యే కూరగాయలను, ఆకు కూరలను క్రమం తప్ప కుండా సమయానికి తీసుకుంటే రక్త శాతం పెరుగుతుంది. దీనికి చిరుధా న్యాలు ఎంతో సహకరిస్తాయి.
ఏవి తీసుకోవాలి..
- అరికెలు రెండు రోజులు, సామలు రెండు రోజులు. మిగతా ధాన్యాలు మూడు రకాలు ఒక్కొక్క రోజు తీసుకోవాలి. అరికెలు మాత్రం వండుకునే ముందు కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి.
- వీటిని ఆహారంగా తీసుకుంటూ క్యారెట్ ముక్కలు 25 గ్రా., బీట్రూట్ ముక్కలు 25గ్రా... జామపండు/ఉసిరి ముక్కలు 05 గ్రా. వీటిని మిక్సీలో వేసి రసం తీసి దానికి 200 మిల్లీలీటర్ నీటిని కలిపి తాగాలి. సాయంత్రం కరివేపాకు మజ్జిగ తాగాలి. కరివేపాకు ఆకులు 20 దంచి, మిక్సీలో వేసి, గ్లాసుడు మజ్జిగలో కలిపి 20 నిమిషాల తర్వాత తాగాలి.
- రాత్రి భోజనానికి గంట ముందు తాగితే మంచిది. ఇలా చేస్తే నెలరోజుల్లో రక్తం పెరుగు తుందని ఆయుర్వేద డాక్టర్లు అంటున్నారు.
