
బోధన్,వెలుగు: అద్దె చెల్లించకపోవడంతో బోధన్సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు గురువారం ఇంటి ఓనర్ తాళం వేశారు. మూడేండ్లుగా అద్దె సుమారు రూ.26 లక్షలు చెల్లించాల్సి ఉంది. విసిగిపోయిన ఇంటి ఓనర్చివరకు ఆఫీసుకు తాళం వేశారు.
దీంతో సబ్ రిజిస్ట్రార్ సాయికుమార్, సిబ్బంది విధులకు వచ్చి బయట మెట్లపైనే కూర్చున్నారు. దీంతో ఆఫీసులో సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. సబ్రిజిస్ట్రార్ సాయికుమార్జిల్లా అధికారులకు సమాచారం అందించడంతో ఓనర్తో మాట్లాడారు. త్వరలో అద్దె చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆఫీసు మధ్యాహ్నం తెరుచుకుంది.