కొన్ని కాంబినేషన్స్ మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. ఆ జంటని మళ్లీ మళ్లీ చూడాలని ఆశపడతారు. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్, కాజోల్లది అలాంటి జోడీనే. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి బెస్ట్ పెయిర్గా నిలిచారు ఇద్దరూ. అజయ్ దేవగన్ని పెళ్లి చేసుకుని కొన్నాళ్లు నటనకు బ్రేక్ ఇచ్చిన కాజోల్.. రీ ఎంట్రీ తర్వాత కూడా షారుఖ్తో కలిసి ‘దిల్వాలే’ మూవీ చేసింది.
ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలిసింది.
అయితే అది కొద్దిసేపేనట. రణ్వీర్ సింగ్, ఆలియాభట్ జంటగా కరణ్ జోహార్ డైరెక్ట్ చేస్తున్న ‘రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ’ మూవీలో షారుఖ్, కాజోల్లు కాసేపు కనిపించనున్నారట. కొన్ని సీన్స్లోనా లేక ఏదైనా పాటలోనా అనేది తెలియాల్సి ఉంది. అయితే విషయం వైరల్ కావడంతో తమ ఫేవరేట్ కాంబో రిపీటవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ తమ కామెంట్స్తో సోషల్ మీడియాని నింపేస్తున్నారు ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి
లక్షల్లో ఫాలోవర్లు..ఒక్క పైసా తీసుకోడు