
ముంబై : దేశపు ఫైనాన్షియల్ క్యాపిటల్గా పేరొందిన ముంబై సిటీలో భారీ ల్యాండ్ డీల్ ఒకటి కుదిరింది. జపాన్ రియల్ ఎస్టేట్ కంపెనీ సుమిటొమో తమ నుంచి రూ. 5,200 కోట్లకు 22 ఎకరాల స్థలాన్ని కొంటున్నట్లు వాడియాలు నడిపే బాంబే డైయింగ్ కంపెనీ బుధవారం ప్రకటించింది. సెంట్రల్ ముంబైలోని వర్లి వద్ద ఈ స్థలం ఉంది. సుమిటొమో సబ్సిడరీ కంపెనీ గోయిసు రెండు దశలలో స్థలానికి డబ్బు చెల్లించనుంది.
ALSO READ: సైనికుడి కోసం ఆర్మీ కుక్క ప్రాణత్యాగం
మొదటి దశలో రూ. 4,675 కోట్లను, కొన్ని కండిషన్లు నెరవేర్చిన తర్వాత మరో రూ. 525 కోట్లను ఆ కంపెనీ చెల్లిస్తుందని బాంబే డైయింగ్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. అమ్మకానికి ఆమోదం తెలిపేందుకు బాంబే డైయింగ్ డైరెక్టర్ల బోర్డు బుధవారం సమావేశమైంది. ఈ ప్రపోజల్కు షేర్హోల్డర్ల ఆమోదం కూడా అవసరం. ల్యాండ్ సేల్ నేపథ్యంలో బీఎస్ఈలో బాంబే డైయింగ్ షేరు 6.93 శాతం ఎగసి రూ. 140.45 వద్ద క్లోజయింది.