
కోల్బెల్ట్, వెలుగు: ఆషాఢ మాస బోనాల వేడుకలు మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గాంధారి మైసమ్మ ఆలయానికి భక్తులు పొటెత్తారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మందమర్రి పట్టణం ఇల్లందు క్లబ్లో సింగరేణి సేవా సమితి, లేడీస్క్లబ్ ఆధ్వర్యంలో అమ్మవారి బోనాలు, శాకాంబరి ఉత్సవాలు, గోరింటాకు వేడుకలు నిర్వహించారు.
సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు, జీఎం సతీమణి స్వరూప రాణి,సెక్రటరీ మనీ, ట్రెజరర్ కవిత, జాయింట్ ట్రెజరర్ సుజాత, కమిటీ మెంబర్స్, క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. రామకృష్ణాపూర్లోని బీజోన్లో రజక సంఘం ఆధ్వర్యంలో మడేలయ్య సీతాలమ్మదేవి బోనాలు ఘనంగా నిర్వహించారు.