సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బోనాల సందడి

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బోనాల సందడి

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రిలో బుధవారం టీఎన్​జీవో గాంధీ యూనిట్​ ఆధ్వర్యంలో శ్రావణ మాస బోనాలు నిర్వహించారు. ఆస్పత్రి ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయానికి సిబ్బంది బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.

టీజీవో హైదరాబాద్​ జిల్లా ప్రెసిడెంట్ ఎంబీ కృష్ణయాదవ్​, గాంధీ టీఎన్జీవో ప్రెసిడెంట్ ప్రభాకర్, గాంధీ సూపరింటెండెంట్​ డాక్టర్​ రాజకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్​డాక్టర్​ సునీల్, ఆర్​ఎంవో- 1 డాక్టర్​ శేషాద్రి,హెచ్​వోడీ ప్రొఫెసర్​ కృపాల్​ సింగ్, మేనేజర్​ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.