ఓల్డ్​ సిటీలో బోనాల ఉత్సవాలు షురూ..

ఓల్డ్​ సిటీలో బోనాల ఉత్సవాలు షురూ..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా సాగే ఓల్డ్​సిటీ బోనాలు మీరాలం మండి మహంకాళి ఆలయంలో నిరాడంబరంగా షురూ అయ్యాయి. మంగళవారం అఖండజ్యోతి, సర్వతోభద్ర మండల ఆరాధన, కుంభారాధన, మండపారాధన, ధ్వజా రోహణ పూజలు చేశారు. అమ్మవారికి మహాభిషేకం, మహా హారతి ఇచ్చారు. 27 రోజుల శ్రీ శతరుద్ర సహిత ద్విశత మహాచండీ యాగాన్ని హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ప్రారంభించారు. ఈ నెల 26వ నుంచి వచ్చేనెల 18 వ తేదీ వరకు బోనాలు, ఒడి బియ్యం సమర్పణ ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య తెలిపారు. 1908లో మూసీకి వరదలు వచ్చినప్పడు అమ్మవారికి చాటలో పసుపు, కుంకుమ, ముత్యాలు, పట్టువస్త్రాలు సమర్పించడంతో తగ్గుముఖం పట్టినట్లు పెద్దలు చెప్తుంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం