మెదక్ లో వైభవంగా బోనాల పండగ

మెదక్ లో వైభవంగా బోనాల పండగ
  • బోనమెత్తిన ఎమ్మెల్యే రోహిత్ రావ్ 

మెదక్, వెలుగు:   మెదక్ పట్టణంలో ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది.  పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు సంప్రదాయ బద్దంగా అలంకరించిన బోనాలను  మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకు వచ్చారు.  పట్టణంలోని ప్రధాన కూడలి అయిన రామదాసు చౌరస్తా నుంచి పోతరాజుల విన్యాసాలు, ఆకట్టుకునే వేషధారణలు, బ్యాండ్ మేళాలు, యువకుల నృత్యాల మధ్య, ఆటోనగర్ లోని నల్ల పోచమ్మ ఆలయం వరకు ఊరేగింపు కొనసాగింది.

 మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని బోనం ఎత్తుకున్నారు.  బోనాల వేడుకలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బట్టి ఉదయ్, బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నల్లాల విజయ్, నాయకులు గట్టేశ్, బోనగిరి శేఖర్, హర్కర్ మహిపాల్, బట్టి రమేశ్, సిద్దయ్య, మల్లేశం, యాదగిరి, కృష్ణ, నర్సింలు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.