
- ప్రస్తుతం ఆర్అండ్బీలో స్పెషల్ సెక్రటరీగా బాధ్యతలు
- నల్గొండ, పేట కలెక్టర్గా చేసిన అనుభవం
- బల్దియా జోనల్ కమిషనర్గానూ సేవలు
హైదరాబాద్సిటీ, వెలుగు: హైదరాబాద్కొత్త కలెక్టర్గా దాసరి హరిచందనను నియమించారు. ఇక్కడ పని చేస్తున్న అనుదీప్ దురిశెట్టిని ఖమ్మం జిల్లా కలెక్టర్గా ట్రాన్స్ఫర్ చేశారు. కొత్త కలెక్టర్గా వస్తున్న దాసరి హరిచందన నగరంలోనే పుట్టి పెరిగారు. 2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన హరిచందన డిగ్రీ హైదరాబాద్లోనే పూర్తి చేశారు. లండన్లో పీజీ చేశారు.
అక్కడ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సివిల్సర్వీసెస్పై ఆసక్తితో ఈ ప్రొఫెషన్లోకి వచ్చారు. వైజాగ్లో అసిస్టెంట్కలెక్టర్గా ఫస్ట్పోస్టింగ్ పొందారు. తర్వాత విజయవాడ సబ్కలెక్టర్గా పని చేశారు. 2014 తర్వాత తెలంగాణకు వచ్చారు. నారాయణపేట, నల్గొండ జిల్లాలకు కలెక్టర్గా పని చేశారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్గా, ఆయుష్ డిపార్ట్మెంట్డైరెక్టర్ గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ వంటి కీలక ఉద్యోగాల్లో పని చేశారు. ప్రస్తుతం రోడ్లు, భవనాల విభాగంలో ప్రత్యేక కార్యదర్శిగా ఉండడంతో పాటు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్డైరెక్టర్ జనరల్గా పని చేస్తున్నారు.
పని చేసిన ప్రతి చోటా తనదైన ముద్ర వేశారు. కలెక్టర్గా పని చేసిన ప్రాంతాల్లో మహిళగా సాటి మహిళలను ఆర్థిక సాధికారత వైపు నడిపించారు. 25 మిలియన్ మెట్రిక్టన్నుల ప్లాస్టిక్ను రీసైకిల్చేసి టైల్స్గా మార్చారు. హైదరాబాద్లోని దుర్గం చెరువు బ్యూటిఫికేషన్చేసి ఎకో టూరిజంగా మార్చేందుకు కష్టపడ్డారు. ఫీడ్ ది నీడ్కమ్యూనిటీ రిఫ్రిజిరేటర్ల నెట్వర్క్రూపొదించి ఫుడ్వేస్ట్ను ఆపి, పేదల ఆకలి తీరే ఆలోచనలు చేశారు.
రూరల్ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్లిటరసీ, హెల్త్కేర్డెవలప్మెంట్పై చొరవ తీసుకొని పని చేశారు. ఆమె చేసిన సోషల్ఇంపాక్ట్కు 2021లో బ్రిటిష్ కౌన్సిల్అవార్డు అందజేసింది. ఆ అవార్డు అందుకున్న ఏకైక ఇండియన్హరిచందన కావడం విషేశం. ఇలా సిటీతో ఎంతో అనుబంధమున్న ఆఫీసర్ హరిచందన హైదరాబాద్కలెక్టర్గా రాబోతుండడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చెరగని ముద్ర వేసిన అనుదీప్
హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 2023 జులై 14న హైదరాబాద్ కలెక్టర్గా వచ్చారు. . స్కూల్ ఎడ్యుకేషన్, హెల్త్, ప్రభుత్వ భూముల రక్షణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాఫీ విత్ కలెక్టర్ ప్రోగ్రామ్ పెట్టి స్కూల్స్లో పాస్పర్సంటేజీ పెంచడానికి ప్రయత్నించారు. ప్రజారోగ్యంపై కూడా దృష్టి పెట్టారు.
మేడ్చల్ కలెక్టర్గా మను చౌదరి
మేడ్చల్ కలెక్టరేట్: మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్ పోట్రును బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని నియమించింది. గౌతమ్ ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు డైరెక్టర్ గా పంపించింది. శుక్రవారం మను చౌదరి బాధ్యతలు
చేపట్టనున్నారు.