
హైదరాబాద్, వెలుగు: బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఎస్ఎంఈ ఐపీఓ చివరి రోజైన మంగళవారం నాటికి 106.65 రెట్ల సబ్స్క్రిప్షన్ సాధించింది. హైదరాబాద్కు చెందిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ టెలికాం, సోలార్కస్టమర్లకు ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) సేవలను, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ సేవలను అందిస్తుంది. మొత్తం 56,96,000 ఈక్విటీ షేర్లను అమ్మకానికి ఉంచగా, 60,74,99,200 షేర్లకు బిడ్లను అందుకుంది.
క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ కొనుగోలుదారుల విభాగం 2.45 కోట్ల షేర్ల సబ్స్క్రిప్షన్ను నమోదు చేసింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) 40.62 లక్షల షేర్లకు దరఖాస్తు చేశారు. దేశీయ ఆర్థిక సంస్థలు (బ్యాంకులు/ఆర్థిక సంస్థలు (ఎఫ్ఐలు)/ఇన్సూరెన్స్ కంపెనీలు) 1.8 లక్షల షేర్లకు దరఖాస్తు చేశాయి. నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో మొత్తం 31.24 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. కార్పొరేట్లు 1.83 కోట్ల షేర్లకు, వ్యక్తులు 25.93 కోట్ల షేర్లకు సబ్స్క్రయిబ్ చేసుకున్నారు. రిటైల్ కేటగిరీలో 27.05 కోట్ల షేర్లకు అప్లికేషన్లు అందాయి. ఒక్కో షేరు ధర రూ.75.