సెప్టెంబర్‌‌ 27న ‘కుమార్తెకు.. ప్రేమతో నాన్న’ పుస్తకావిష్కరణ

సెప్టెంబర్‌‌ 27న ‘కుమార్తెకు.. ప్రేమతో నాన్న’ పుస్తకావిష్కరణ

హైదరాబాద్‌‌ సిటీ, వెలుగు: అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా జాలాది రత్న సుధీర్‌‌ రచించిన ‘కుమార్తెకు... ప్రేమతో నాన్న’ పుస్తకావిష్కరణ సభ సెప్టెంబర్‌‌ 27న శనివారం సాయంత్రం రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌‌ హాల్‌‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్​ ఏనుగు నరసింహారెడ్డి, సీఎస్‌‌.రాంబాబు, దినకర్‌‌ బాబు రిటైర్డ్​ ఐఏఎస్‌‌, రచయిత్రి పల్లవి, కవయిత్రి దేవనపల్లి వీణావాణి తదితరులు పాల్గొననున్నారు.