
లగ్జరీ ఆటోమొబైల్ తయారీదారు లెక్సస్ ఇండియా, తన ఫ్లాగ్షిప్ మల్టీపర్పస్ వెహికల్(ఎంపీవీ), ఆల్-న్యూ లెక్సస్ ఎల్ఎం కోసం బుకింగ్లను ప్రారంభించింది. ఇందులో ఎల్ఎం 350హెచ్ ఫోర్ సీటర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్, ఎల్ఎం 350హెచ్ సెవెన్ సీటర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వేరియంట్లు ఉన్నాయి.
ధరలు తర్వాత ప్రకటిస్తారు. వీటిలో 142 కిలోవాట్కెపాసిటీ కలిగిన, 2.5-లీటర్ నాలుగు- సిలిండర్ ఇంజన్ ఉంటుంది. నికెల్-మెటల్ హైడ్రైడ్ బ్యాటరీతో ఇది నడుస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ మరో ప్రత్యేకత.