పతంగి కోసం హైటెన్షన్ వైర్లను స్టీల్ పైపుతో కొట్టిన బాలుడు

పతంగి కోసం హైటెన్షన్ వైర్లను స్టీల్ పైపుతో కొట్టిన బాలుడు
  • తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియాకు తరలింపు

ఎల్బీనగర్, వెలుగు:హైటెన్షన్ విద్యుత్ వైర్లకు చిక్కుకున్న పతంగిని స్టీల్ పైపుతో తీయడానికి ప్రయత్నించి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రాచలూరుకు చెందిన గణేశ్ (15) మీర్‌‌‌‌పేట్ పరిధిలోని ప్రశాంతి నగర్​లో ఉంటున్న తన మేనత్త ఇంటికి ఆధార్ కార్డు అప్‌‌‌‌డేట్ కోసం వచ్చాడు. ఇంటి సమీపంలోని హైటెన్షన్ వైర్లకు పతంగి చిక్కుకోవడంతో స్టీల్ పైపు సాయంతో తీయడానికి ప్రయత్నించాడు. 

ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బాధితుడిని వెంటనే ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరోవైపు కరెంట్​షాక్ వల్ల ఇంట్లో ఫ్యాన్లు ఊడిపడి పలు గృహోపకరణాలు షార్ట్ సర్క్యూట్​కు గురై భారీ ఆస్తి నష్టం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, హైడ్రా సిబ్బంది కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.