నీటి సంపులో పడి బాలుడి మృతి

నీటి సంపులో పడి బాలుడి మృతి

హైదరాబాద్ లో నీటి సంపులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి జవహర్ నగర్ లోని బీరప్ప గడ్డలో హుస్సేనప్ప, శ్రీదేవి దంపతులకు కుమారుడు సాయిచరణ్ అనే 11 నెలల బాలుడు ఉన్నాడు. 

ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలుడు అక్కడే ఉన్న నీటి సంపులో పడి పోయాడు. ఎవరూ గుర్తించకపోవడంతో సంపులో మునిగి మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల వేదన అరణ్య రోదనగానే మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.