పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చెందిన బోయినపల్లి సంపత్రావు ఇటీవల మృతిచెందగా, ఆదివారం దశదినకర్మను నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరై సంపత్రావు ఫొటోకు నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మేడిశెట్టి రాములు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జితేందర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
