మాదాపూర్, వెలుగు: రోజురోజుకు బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని.. ఆ వ్యాధిపై అవగాహన పెంచుకుని వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే దాని తీవ్రతను తగ్గించవచ్చని మెడికవర్ హాస్పిటల్స్ క్లినికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి తెలిపారు. వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా శనివారం మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్ను ప్రారంభించి అనంతరం అవగాహన పోస్టర్ రిలీజ్ చేశారు.
న్యూరాలజిస్ట్ డాక్టర్ రంజిత్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది కోటి 70 లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్నారన్నారు. ప్రతి నలుగురు బాధితుల్లో ఒకరు లైఫ్ టైమ్ స్ట్రోక్ కు గురవుతున్నారన్నారు. దీని కారణంగా ప్రతి 6 సెకన్లకు ఒకరు చనిపోతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయన్నారు. బ్రెయిన్ స్ట్రోక్కు గురైన వారి ప్రాణాలు కాపాడటానికి ప్రతి క్షణం విలువైనదేనన్నారు. న్యూరో స్ట్రోక్ సెంటర్లు కొన్నిచోట్ల మాత్రమే ఉన్నాయన్నారు. మెడికవర్లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో అన్ని సదుపాయాలు, సరైన టైమ్లో ట్రీట్ మెంట్, 24 గంటల పాటు డాక్టర్లు ఉంటారన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు సతీష్కుమార్, మాత ప్రసాద్, విక్రమ్ కిషోర్, సిబ్బంది పాల్గొన్నారు.